Monday, September 23, 2024
Homeజిల్లా వార్తలుగుడుంబా స్థావరాలపై దాడులు

గుడుంబా స్థావరాలపై దాడులు

గుడుంబా స్థావరాలపై దాడులు

స్పాట్ వాయిస్ నర్సంపేట (ఖానాపురం) :ఖానాపురం మండలంలోని నాజీ తండా, లక్ష్మణ్ తండా, బోటిమీది తండాలో ఖానాపూర్ పోలీసులు, నర్సంపేట, గూడూరు ఎక్సైజ్ పోలీస్ లు , ఉమ్మడిగా గుడుంబా స్థావరాలపై శనివారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1000 బెల్లం లీటర్ల పానకం ధ్వంసం చేశారు. గుడుంబా తయారు చేస్తే కేసు నమోదు చేయడమే కాకుండా బైండోవర్ చేస్తామని, పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ దాడుల్లో ఖానాపూర్ ఎస్సై పిట్టల తిరుపతి, ఎక్సైజ్ ఎస్సై రాజేశ్వరి, గూడూరు
ఎక్సైజ్ ఎస్సై జయశ్రీ పోలీసు, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments