Monday, September 23, 2024
Homeతెలంగాణకారుతోనే కలిసిపోతాం..

కారుతోనే కలిసిపోతాం..

మునుగోడులో కారుతోనే ఉంటామన్న సీపీఐ
భవిష్యత్‌లోనూ టీఆర్ఎస్‌తోనే స్పష్టం
స్పాట్ వాయిస్, హైదరాబాద్: మునుగోడులో టీఆర్‌ఎస్‌కు మద్దతుపై సీపీఐ స్పష్టతనిచ్చింది. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు. శనివారం మునుగోడులో జరిగే టీఆర్ఎస్ బహిరంగ సభకు రావాలని కోరినట్లు తెలిపారు. సీపీఐ తరపున పల్లా వెంకట్ రెడ్డి కేసీఆర్ సభలో పాల్గొంటారని చెప్పారు. ప్రగతిశీల రాజకీయాలకు కేసీఆర్ కంకణబద్ధుడై ఉన్నారని తెలిపారు. భవిష్యత్ లోనూ టీఆర్ఎస్‌తో కలిసివెళ్తామని స్పష్టత నిచ్చారు. అనివార్యంగా మునుగోడు ఉప ఎన్నిక తెరపైకి వచ్చిందన్నారు. తన స్వార్థ ప్రయోజనం కోసం రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని ఆయన విమర్శించారు. అందుకే ప్రజలపై ఉప ఎన్నిక రుద్దబడిందన్నారు. నేటి రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా ఫాసిస్ట్ బీజేపీని ఓడించడానికి బలమున్న పార్టీకి మద్దతు ఇవ్వాలనుకున్నట్లు నేతలు వివరించారు. బాధ్యతాయుతమైన పార్టీగా మతతత్వ పార్టీనీ ఓడించే పార్టీకి మద్దతు ఇవ్వాలని తీర్మానం చేశామన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments