Tuesday, September 24, 2024
Homeక్రైమ్స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల వేళ తీవ్ర విషాదం..

స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల వేళ తీవ్ర విషాదం..

స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల వేళ తీవ్ర విషాదం..
ఏడుగురు జవాన్ల మృతి..

స్పాట్ వాయిస్ , డెస్క్: స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల వేళ దేశంలో తీవ్ర విషాదం నెలకొంది. జమ్ముకశ్మీర్​లో ఘోర ప్రమాదం జరిగింది. పహల్గామ్​లోని ఫ్రిస్లాన్ చందన్వారి రోడ్డు ప్రాంతంలో భద్రతా బలగాల వాహనం ప్రమాదానికి గురై నదిలో పడిపోయింది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఏడుగురు ఐటీబీపీ జవాన్లు చనిపోయారు. చాలా మంది సైనికులు తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని అధికారులు ఆసుపత్రికి తరలించారు. మంగళవారం ఉదయం 39 మంది ఐటీబీపీ జవాన్లతో ప్రయాణిస్తున్న బస్సు.. బ్రేక్​లు ఫైయిల్​ అవ్వడంతో పక్కన ఉన్న నదిలో పడిపోయింది. బస్సులోని జవాన్లంతా అమర్​నాథ్​ యాత్రకు సంబంధించిన విధులు నిర్వర్తించి తిరిగి వస్తున్నట్లు ఐటీబీపీ అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments