Wednesday, September 25, 2024
Homeజిల్లా వార్తలుమహనీయుల విగ్రహాలను శుభ్రపరిచిన బీజేపీ నాయకులు

మహనీయుల విగ్రహాలను శుభ్రపరిచిన బీజేపీ నాయకులు

మహనీయుల విగ్రహాలను శుభ్రపరిచిన బీజేపీ నాయకులు

స్పాట్ వాయిస్ , వర్ధన్నపేట: బీజేపీ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు అజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలకు వర్ధన్నపేట పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి, మండల పరిధిలోని ఇల్లంద గ్రామంలో స్వామి వివేకానంద, బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ , మహాత్మా గాంధీ విగ్రహాలను బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ శుభ్రపరిచి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది మహనీయుల త్యాగ ఫలంతో మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంవత్సర కాలం నుంచి అజాదీ కా అమృత్ మహోత్సవాల పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే మనకు స్వాతంత్ర్యం రావడానికి కారణమైన ఎంతో మంది పోరాట యోధులను స్మరించుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యుడు, మహంకాళి(సికింద్రాబాద్)జిల్లా ఇన్ చార్జి బన్న ప్రభాకర్ , వర్ధన్నపేట బీజేపీ మండల అధ్యక్షుడు రాయపురపు కుమారస్వామి, పట్టణ అధ్యక్షుడు చీటూరి రాజు, జిల్లా ఉపాధ్యక్షులు నాంపల్లి యాకయ్య, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జడ సతీష్, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తక్కలపల్లి శ్రీదేవి, సామాజిక కార్యకర్త మోడెం కుమారస్వామి, జిల్లా నాయకులు కుందూరు మహేందర్ రెడ్డి , మాజీ పట్టణ అధ్యక్షుడు కొండేటి సత్యం, ఇల్లంద మాజీ సర్పంచ్ మంచే సాయిలు, దేవేందర్ రావు ,మల్లెపాక అనిల్ ,నకరికంటి రవీందర్, రాయబారపు వైకుంఠం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments