Wednesday, September 25, 2024
Homeజిల్లా వార్తలుసమరయోధుల త్యాగాలతోనే స్వేచ్ఛ..

సమరయోధుల త్యాగాలతోనే స్వేచ్ఛ..

సమరయోధుల త్యాగాలతోనే స్వేచ్ఛ

-సీఈ సిద్దయ్య

-కేటీపీపీలో ఉత్సాహంగా తిరంగా ర్యాలీ

స్పాట్ వాయిస్, గణపురం: దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలతో భారతావనికి స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు సిద్ధించాయని..వారి సేవలు., త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా స్వీకరించాలని చెల్పూర్ కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ) సీఈ సిద్దయ్య అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం కేటీపీపీలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో అయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, కార్మికులు జాతీయ జెండాను పట్టుకొని ఉత్సాహంగా ర్యాలీలో సందడి చేశారు. అనంతరం సీఈ సిద్దయ్య మాట్లాడుతూ.. భారతదేశ విముక్తి కోసం పోరాటం సాగించిన అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను నగర్వంగా ఎగరేయాలన్నారు. ఈనెల 16న తలపెట్టిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ ఇంజనీర్లు తిరుపతయ్య, ముత్యాలరావులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments