Saturday, September 28, 2024
Homeతెలంగాణరాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం

రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం

టీఆర్ఎస్ ద్రోహుల పార్టీ
రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం
స్పాట్ వాయిస్, హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను సోమవారం శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి సమర్పించారు. ఈమేరకు ఆయన రాజీనామాను స్పీకర్ పోచారం ఆమోదించారు. అంతకుముందు గన్​పార్కుకు చేరుకున్న రాజగోపాల్ రెడ్డి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ తెలంగాణ ద్రోహుల పార్టీ అయిందని విమర్శించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీల్లో ఉన్న చాలా మంది నేతలు తనతో మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రభుత్వంపై ధర్మయుద్ధం ప్రకటించానని.. దీనిలో తెలంగాణ, మనుగోడు ప్రజలు గెలుస్తారని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు.

చండూరు సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఆయన మనుషులు మాట్లాడిన భాష విన్న తర్వాత తెలంగాణ సమాజం తల దించుకుంటోందన్నారు. అలాంటి వ్యక్తి పార్టీ అధ్యక్షుడని.. సీఎం అవుతారంట అని వ్యాఖ్యానించారు. డబ్బులిచ్చి పదవులు తెచ్చుకున్నవాళ్లు.. తప్పుడు పనులతో జైలుకెళ్లి వచ్చినవారు మాట్లాడుతున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఏ త్యాగం చేయకుండా.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనకుండా ఇప్పుడు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మరని చెప్పారు. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని చెప్పారు. తన రాజీనామాతో మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇస్తారని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments