Saturday, June 7, 2025
Homeజిల్లా వార్తలుదళితుల అభ్యున్నతి కోసమే ‘దళితబంధు’

దళితుల అభ్యున్నతి కోసమే ‘దళితబంధు’

దళితుల అభ్యున్నతి కోసమే ‘దళితబంధు’
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్ : దళితుల అభ్యున్నతి కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం పరకాల పట్టణంలో దళితబంధు పథకం ద్వారా ఏర్పాటు చేసిన స్వామిదాసు కిరాణం, జనరల్ స్టోర్స్ ను ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసమే ప్రవేశపెట్టిన పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments