Sunday, June 8, 2025
Homeక్రైమ్తీవ్ర విషాదం...

తీవ్ర విషాదం…

తీవ్ర విషాదం..
ఉరేసుకుని ముగ్గురి బలవన్మరణం..
స్పాట్ వాయిస్ , సంగారెడ్డి: ఉరి వేసుకుని ముగ్గురు బలవన్మరణానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం భానూరులో మధ్యప్రదేశ్ నుంచి వలస వచ్చిన తల్లి, కుమార్తె, మరిది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి రేఖ(28), కుమార్తె (2) , రేఖ మరిది బాసుదేవ్‌ కుష్బా(27) ఉరివేసుకున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరి మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments