Sunday, June 8, 2025
Homeతెలంగాణఅవమానాలు భరిస్తూ ఉండలేను..

అవమానాలు భరిస్తూ ఉండలేను..

అవమానాలు భరిస్తూ ఉండలేను..
రాజీనామా పై క్లారిటీ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి

స్పాట్ వాయిస్ , మునుగోడు: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి రాజీనామా ఎపిసోడ్​కు ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్‌ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు స్వయంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. ప్రజల కోసమే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపిన రాజగోపాల్‌రెడ్డి.. అవమానాలు భరిస్తూ ఉండలేనన్నారు. రాజీనామా నిర్ణయం తన స్వార్థం కోసం కాదని.. మునుగోడు అభివృద్ధి కోసమేనని చెప్పారు. ప్రజలు కోరుకుంటే మళ్లీ పోటీ చేస్తానన్న రాజగోపాల్‌.. ఏ పార్టీలో చేరాలనేది మునుగోడు ప్రజలతో చర్చిస్తానన్నారు. తన రాజీనామాతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని కోరుకుంటున్నానని చెప్పారు. త్వరలో స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments