Tuesday, April 22, 2025
Homeజిల్లా వార్తలువృద్ధురాలికి రాణా ప్రతాప్ సాయం

వృద్ధురాలికి రాణా ప్రతాప్ సాయం

స్పాట్ వాయిస్, నర్సంపేట (ఖానాపురం) : ఇటీవల కురిసిన వర్షాలకు ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామానికి చెందిన జాడి వీరమ్మ ఇల్లు కూలిపోయింది. విషయం తెలుసుకున్న నర్సంపేట నియోజకవర్గ బీజేపీ యువ నేత గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గురువారం ఆమెను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. తక్షణమే అధికారులు స్పందించి వీరమ్మను పునరావాస కేంద్రానికి తరలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు అబోతు రాజు యాదవ్, మండల ఇన్ చార్జి గడ్డం ఆంజనేయులు, చెన్నారావుపేట మండల అధ్యక్షుడు బలుగూరి నరేందర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు లింగబతుల యాకస్వామి, పృథ్వీరాజ్, మైనారిటీ మోర్చా జిల్లా కార్యదర్శి షేక్ సలీం, మహిళా మోర్చా జిల్లా నాయకురాలు సుత్రపు సరిత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments