Sunday, April 20, 2025
Homeతెలంగాణసీఎం కొడుకు సీఎం కాడు..

సీఎం కొడుకు సీఎం కాడు..

భయపడుతున్న టీఆర్ఎస్
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
స్పాట్ వాయిస్, హైదరాబాద్: అవినీతి సొమ్ముతో టీఆర్ఎస్ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సీఎం కొడుకు సీఎం కాలేడని ఆయన ఎద్దేవా చేశారు. తమ సామాన్య కార్యకర్త కూడా ప్రధాని అవుతారన్నారు. అధికారం పోతుందని టీఆర్ఎస్‌కు భయం పట్టుకుందన్నారు. రాజకీయాలను కేసీఆర్ దిగజార్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీని చూసి టీఆర్ఎస్ బయపడుతోందని, అవినీతి పాలన చేస్తున్న పార్టీ నుంచి నేర్చుకోవాల్సింది ఏమే లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments