Tuesday, September 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్రాకేష్ సోదరుడికి ఆర్డీవో ఆఫీసులో జాబ్..

రాకేష్ సోదరుడికి ఆర్డీవో ఆఫీసులో జాబ్..

ఉత్తర్వులు జారీ చేసిన వరంగల్ కలెక్టర్ గోపి
స్పాట్ వాయిస్, నర్సంపేట(ఖానాపురం): సికింద్రాబాద్ కాల్పుల్లో మృతిచెందిన దామెర రాకేష్ సోదరుడు రాజుకు నర్సంపేట ఆర్డీవో కార్యాలయంలో ఉద్యోగం కల్పిస్తూ వరంగల్ కలెక్టర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాకేష్ కుటుంబానికి రూ.25 లక్షల చెక్, ఉద్యోగ నియామక పత్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కలెక్టర్ గోపి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, అరూరి రమేష్ అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన రాకేష్ సంతాప సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయకుంటే కేంద్ర ప్రభుత్వం కూలిపోతుందన్నారు. మోడీ నల్లచట్టాల వల్ల 700 మంది రైతులు చనిపోయారని పేర్కొన్నారు. రాకేష్ మృతిని కొందరు రాజకీయం కోసం వాడుకుంటున్నారని చెప్పారు. కనీసం రాకేష్ కుటుంబాన్ని ఆదుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. రాకేష్ కుటుంబాన్ని సీఎం దగ్గరకు తీసుకెళ్తామని, మరింత ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాకేష్ గ్రామం డబ్బీర్ పేటను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments