Monday, September 23, 2024
Homeక్రైమ్ఘోర రోడ్డు ప్రమాదం..

ఘోర రోడ్డు ప్రమాదం..

ఆగిఉన్న లారీ ని ఢీకొన్న కారు..
ఇద్దరు సజీవ దహనం..
స్పాట్ వాయిస్ , నిజామాబాద్: ఆగి ఉన్న లారీని కారు ఢీకొనగా..ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వేల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. వెంటనే కారులో మంటలు చెలరేగాయి. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మృతులు జగిత్యాల జిల్లా వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments