Sunday, September 22, 2024
Homeజిల్లా వార్తలు'అగ్నిపథ్' ను వెనక్కి తీసుకోవాలి

‘అగ్నిపథ్’ ను వెనక్కి తీసుకోవాలి

అగ్నిపథ్ వెనక్కి తీసుకోవాలి
యూత్ కాంగ్రెస్ భూపాలపల్లి అధ్యక్షుడు శ్రీకాంత్
స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్ : యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి, కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గం ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆర్మీని కూడా ప్రైవేటు దిశగా తీసుకుపోవడం మోడీ ప్రభుత్వానికే చెల్లిందని అన్నారు. మోడీ ప్రభుత్వం కేవలం అంబానీ ఆదానీల కోసమే పనిచేస్తుందని, అందరికోసం కాకుండా కొందరు ధనవంతుల కోసం ఆర్మీని కూడా ప్రైవేట్ పరం చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని ఉన్నారు. మోడీ ప్రభుత్వం వెంటనే అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోకపోతే యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ కార్యాలయాలను ముట్టడి చేసి బీజేపి నాయకులను రాష్ట్రంలో తిరగకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు బడితల ప్రసాద్, తోట రంజిత్, పృథ్వీరాజ్, పవన్, విజయ్, నరేష్, ఆంజనేయులు, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments