Sunday, September 22, 2024
Homeజిల్లా వార్తలుశ్రీ శివసాయి ధ్యాన మందిర భూమి పూజ

శ్రీ శివసాయి ధ్యాన మందిర భూమి పూజ

శ్రీ శివసాయి ధ్యాన మందిర భూమి పూజ
పాల్గొన్న గండ్ర దంపతులు
స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్ : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1000 క్వార్టర్లలో పిరమిడ్ స్పిరిచ్యువల్ సోసైటీ భూపాలపల్లి వారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ శివసాయి ధ్యాన మందిర నిర్మాణ పనులు ఆదివారం చేపట్టారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథులుగా గండ్ర దంపతులు హాజరయ్యారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జెడ్పీ ఛైర్ పర్సన్, టీఆర్ఎస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, ఇతర పట్టణ కమిటీ నాయకులు, సీనియర్, ముఖ్య నాయకులు, టీబీజీకేఎస్ నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments