Sunday, April 20, 2025
Homeజిల్లా వార్తలుజయశంకర్ జిల్లాలో దొంగనోట్ల కలకలం

జయశంకర్ జిల్లాలో దొంగనోట్ల కలకలం

స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దొంగనోట్లు కలకలం రేపాయి. జిల్లాలోని గణపురం మండల కేంద్రంలో శనివారం బ్రాండీ షాపులో రూ. 2000 నకిలీ నోటును కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చి వెళ్లారు. సదరు బ్రాండీ షాప్ యజమాని కొద్దిసేపటికి దొంగ నోటుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
గతంలోనూ..
గతంలోనూ గణపురం మండలం దొంగనోట్ల చలమణీ జరిగింది. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా నకిలీ నోట్లను ముద్రించి చెలామణీ చేస్తున్నారు. రద్దీగా ఉండే ప్రదేశాలు, నిత్యం వ్యాపారం జరిగే ప్రదేశాల్లో ఈ దొంగ నోట్లను బదిలీ చేస్తున్నారు. అయితే వ్యాపారులు రద్దీ సమయంలో వాటిని గుర్తించలేకపోతున్నారు. మండలంలో నకిలీ నోట్ల దందాతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ నోట్ల ముఠాను గుర్తించి పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments