Sunday, September 22, 2024

భూమి కోసం..

అన్న గొంతుకోసిన తమ్ముడు
మానుకోటలో విషాదం..
స్పాట్ వాయిస్, మహబూబాబాద్: మానుకోట జిల్లా రోటిబండ తండాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూ వివాదంతో కక్ష పెంచుకున్న తమ్ముడు అన్న గొంతు కోసి దారుణంగా చంపేశాడు. ఈ ఘటనతో ఆ జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. తండాకు చెందిన రామచంద్రు-పరోషన్ దంపతులకు వెంకన్న, జనార్దన్, గోవర్ధన్ ముగ్గురు కొడుకులు ఉన్నారు. రామచంద్రుకు 6 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా ముగ్గురు కుమారులు, తండ్రి కలిపి పంచుకోగా…ఒక్కొక్కరికి ఎకరంన్నర భూమి వచ్చింది. రెండేళ్ల క్రితం రామచంద్రు భార్య మృతి చెందింది. రామచంద్రు తల్లి మోతిని పెద్ద కుమారుడు వెంకన్న పోషించాలని, ఇందుకోసం ఎకరం భూమిని వెంకన్నకు పెద్దమనుషుల సమక్షంలో జరిగిన పంచాయితీలో ఇచ్చారు. మిగిలిన అర ఎకరం భూమి విషయంలో వెంకన్నకు ఇద్దరు తమ్ముళ్లు గోవర్ధన్, జనార్దన్లతో తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి వెంకన్న ఇంటి బయట నిద్రిస్తుండగా తమ్ముడు గోవర్ధన్ గొంతు కోసి పరారయ్యాడు. వెంకన్న అరుపులతో చుట్టుపక్కల వారు బయటికు వచ్చి చూడగా అప్పటికే మృతి చెందాడు. తండావాసులు పోలీసులకు సమాచారం అందించగా సీఐ రవికుమార్, ఎస్సై అరుణ్ కుమార్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీశారు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బంధుమిత్రులు.. తండావాసుల రోదనలతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుమారుడు పోలీసులను వేడుకున్నాడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments