Sunday, September 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్స్పాట్ ఫ్లాష్..

స్పాట్ ఫ్లాష్..

సుబ్బారావుకు 14 రోజుల రిమాండ్
స్పాట్ వాయిస్, క్రైమ్: సికింద్రాబాద్ అల్లర్లకు ప్రధాన సూత్రధారిగా మొదటి నుంచి అనుమానిస్తున్న ఆవుల సుబ్బారావును పోలీసులు అరెస్ట్​ చేశారు. సుబ్బారావుతో పాటు ఈ అల్లర్లతో ప్రమేయం ఉన్న అతడి అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వీరి నుంచి కీలక ఆధారాలు సేకరించిన అధికారులు రైల్వేస్టేషన్​లో విధ్వంసం జరగడానికి మూలకారణం సుబ్బారావేనని తేల్చారు. విచారణ ముగియటంతో.. సుబ్బారావుకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సుబ్బారావుతో పాటు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డిని పోలీసులు రైల్వేకోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో సుబ్బారావుకు రైల్వే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రైల్వే కోర్టు నుంచి ఈ నలుగురు నిందితులను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments