Monday, September 23, 2024
Homeజిల్లా వార్తలు3న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం

3న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం

3న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం
శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలి
పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దుప్పటి ఆనంద్
స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్ : జూలై 3వ తేదీన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం తెలంగాణలో నిర్వహించడం మనందరి అదృష్టమని, దీనిని విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు దుప్పటి ఆనంద్ అన్నారు. నర్సంపేట మండలం నాగులపల్లిలో ఆదిదవారం బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ముత్తినేని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆనంద్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. 3న నిర్వహించే జాతీయ కార్యవర్గ సమావేశానికి దేశంలోని 19 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, జాతీయ కార్యవర్గ సభ్యులంతా హాజరుకానున్నారని, ఈ బహిరంగ సభను విజయవంతం చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఇందులో భాగంగానే విరాళాలు సేకరిస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఓబీసీ మోర్చా అధ్యక్షుడు వెల్దండి మార్కండేయ, బీజేవైఎం మండల అధ్యక్షుడు అంబేద్కర్, నాగులపల్లి గ్రామ పార్టీ బూత్ అధ్యక్షుడు బొల్లుని భిక్షపతి, బొల్లుని శోభన్ బాబు, మాజీ ఉపసర్పంచ్ గంగుల బాబు, జిల్లా ప్రచార కార్యదర్శి అనిల్, శక్తి కేంద్రం ఇన్ చార్జులు మాధవ శంకర్, బండారు సాంబయ్య, కట్ల రామచంద్ర రెడ్డి, చందు, కార్యాలయ కార్యదర్శి దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments