Monday, September 23, 2024
Homeజిల్లా వార్తలుకేసీఆర్ వెంటే.. తెలంగాణ ప్రజలు

కేసీఆర్ వెంటే.. తెలంగాణ ప్రజలు

కేసీఆర్ వెంటే.. తెలంగాణ ప్రజలు
23వ డివిజన్ మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ
వరంగల్ గోపాలస్వామి గుడి జంక్షన్ లో టీఆఎస్ సంబురాలు
స్పాట్ వాయిస్, వరంగల్ : తెలంగాణ ప్రజలంతా టీఆర్ ఎస్ వెంటే ఉన్నారనడానికి నిదర్శనం మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలేనని 23వ డివిజన్ మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ అన్నారు. ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందడాన్ని హర్షిస్తూ ఆదివారం సాయంత్రం 23వ డివిజన్ మాజీ కార్పొరేటర్, డివిజన్ టీఆర్ ఎస్ ఇన్ చార్జి యెలుగం లీలావతి సత్యనారాయణ ఆధ్వర్యంలో వరంగల్ గోపాలస్వామి గుడి జంక్షన్ లో పటాకులు కాల్చి , స్వీట్లు పంచి పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా యెలుగం లీలావతి సత్యనారాయణ మాట్లాడుతూ బూటకపు, మాయ చెప్పి ఎన్నికల్లో గెలవాలన్న బీజేపీకి మునుగోడు నియోజకవర్గ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా టీఆర్ ఎస్ ప్రభంజనం సృష్టిస్తుందని, మరో మారు అధికారంలోకి రావడం ఖాయమన్నారు. టీఆర్ ఎస్ పార్టీ కి భారీ మెజార్టీ ని కట్టబెట్టిన మునుగోడు ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ యెలుగం రవిరాజు, వరంగల్ టీఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ భాషకర్ల హరిక్రిష్ణ పటేల్, 23 వ డివిజన్ యూత్ అధ్యక్షుడు కొత్తపెల్లి వినయ్, 23వ డివిజన్ బీసీ సెల్ అధ్యక్షుడు ఒల్లాల మొగిలి, ప్రధాన కార్యదర్శి కర్రె రవి, మహిళా నాయకురాలు కోళ అనసూయ, టీఆర్ ఎస్ నాయకులు మురళి, తుమ్మ కన్నయ్య, రహీం, వెల్ది రాజు, గణేశ్, వరుణ్, ఉపేందర్, శ్రీను, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments