Sunday, September 22, 2024
Homeజిల్లా వార్తలు108లో ప్రసవం…

108లో ప్రసవం…

స్పాట్ వాయిస్, గణపురం: పురిటి నొప్పులతో బాధ‌పడుతున్న మహిళను 108 అంబులెన్స్​‍లో దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవించిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాల చోటు చేసుకుంది. అంబులెన్స్​‍ ఈఎంటీ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం… జిల్లాలోని నాగారం గ్రామంలో నివాసం ఉండే తోలెం జమునకు సోమవారం సాయంత్రం పురిటి నొప్పులు వస్తుండడంతో 108కు సమాచారం అందించారు.
వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది ఆమెను భూపాలపల్లి దవాఖానకు తరలిస్తుండగా రాంపూర్ గ్రామ సమీపంలోకి రాగానే నొప్పులు ఎక్కువ‌వ్వడంతో ఈఎంటీ సతీష్ అంబులెన్స్​‍ డ్రైవర్‌ శరత్ సహకారంతో ప్రసవం చేశారు. జమున ఆడబిడ్డకు జన్మనివ్వగా, తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని, మెరుగైన వైద్యం కోసం జిల్లా దవాఖానకు తరలించినట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments