Monday, September 23, 2024
Homeజిల్లా వార్తలుస్వయంకృషి మున్నూరుకాపు సంఘం నూతన కమిటీ ఎన్నిక

స్వయంకృషి మున్నూరుకాపు సంఘం నూతన కమిటీ ఎన్నిక

స్వయంకృషి మున్నూరుకాపు సంఘం నూతన కమిటీ ఎన్నిక
స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్వయం కృషి మున్నూరు కాపు సంఘం సుభాష్ కాలనీ నూతన కమిటీని ఆదివారం స్థానిక కేటీకే 5 ఇంక్లైన్ లో సంఘ సభ్యుల సమక్షంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా భాస్కరి సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా దేవరకొండ మధు, మేడ వెంకటస్వామి, జనరల్ సెక్రెటరీగా కొట్రంగి నాగార్జున, జాయింట్ సెక్రెటరీగా అనంతుల సంపత్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా లట్ట శ్రీను, పసిక రాజశేఖర్, అధికార ప్రతినిధిగా సుంకరి గోవర్ధన్, కోశాధికారిగా భాస్కరి సుధాకర్, సలహాదారులుగా సత్యనారాయణ, రవి, భరత్, రమేష్, సుధాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు చెబుతున్నామని, రానున్న రోజుల్లో సంఘం బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments