Monday, September 30, 2024
Homeజిల్లా వార్తలుపేదలకు ఆర్థిక భరోసా సీఎంఆర్ఎఫ్

పేదలకు ఆర్థిక భరోసా సీఎంఆర్ఎఫ్

పేదలకు ఆర్థిక భరోసా సీఎంఆర్ఎఫ్
జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి
లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
స్పాట్ వాయిస్, శాయంపేట : పేద ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఆర్థిక భరోసా అని జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. ఆదివారం శాయంపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను గండ్ర జ్యోతి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ , టీఆర్ ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని తెలిపారు. ఆరోగ్య శ్రీ లో వర్తించని వ్యాధులకు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదల వైద్యానికి అయ్యే ఖర్చులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్య చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డి, కొప్పుల ఎంపీటీసీ మేకల శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ శరత్, టీఆర్ ఎస్ కొప్పుల గ్రామ శాఖ అధ్యక్షుడు సామల మధుసూదన్, టీఆర్ ఎస్ సోషల్ మీడియా ఇన్ చార్జి మామిడి అశోక్, గుర్రం సుధాకర్, మామిడి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments