Saturday, September 21, 2024
Homeక్రీడలుజాతీయ స్థాయి క్రీడాకారుడికి ఘన సన్మానం

జాతీయ స్థాయి క్రీడాకారుడికి ఘన సన్మానం

జాతీయ స్థాయి క్రీడాకారుడికి ఘన సన్మానం
స్పాట్ వాయిస్ కేసముద్రం : కేసముద్రం మండలం సర్వాపురం గ్రామానికి చెందిన జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారుడు భూక్య సైదులును తాళ్లపూసపల్లి టీఆర్ఎస్ జిల్లా నాయకుడు రావుల రవిచందర్ రెడ్డి సోమవారం ఘనంగా సన్మానించారు. సైదులు గత నెల గోవా రాష్ట్రంలో జరిగిన జాతీయస్థాయి అండర్ -17 ఇయర్స్ వాలీబాల్ విభాగంలో ప్రథమ స్థానం సాధించి, తెలంగాణ జట్టు తరపున కీలక పాత్ర పోషించాడని, బెస్ట్ స్పైకర్ గా రూ. పదివేల బహుమతి గెలుచుకున్నాడు. జెడ్పీ హెచ్ ఎస్ తాళ్ల పూసపల్లి కాలేరు యాదగిరి మాట్లాడుతూ సైదులుకు మంచి భవిష్యత్ ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ సుధాకర్, కొమురయ్య, ఉపాధ్యాయులు కోటియా, గోపికృష్ణ, సోమయ్య, కుమారస్వామి, మల్లారెడ్డి, పాహీం, వ్యాయామ ఉపాధ్యాయుడు ఎండీ నసీరుద్దీన్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments