Saturday, September 28, 2024
Homeజిల్లా వార్తలుగణపురంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

గణపురంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

34 ఏళ్ల అనంతరం కలిసిన విద్యార్థులు
గణపురంలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
స్పాట్ వాయిస్, గణపురం: గణపురం పాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు 34 ఏళ్ల అనంతరం ఒక్క చోట కలిశారు. 1987- 88 సంవత్సరంలో గణపురం ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులందరూ పాఠశాల ఆవరణలో 34 ఏళ్ల అనంతరం కలిసి ఉద్వేగానికి లోనయ్యారు. పదోతరగతి పూర్తి చేశాక వృత్తిరీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులందరూ ఆదివారం ఒక్క చోట కలిసి తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. కార్యక్రమంలో నారగాని దేవేందర్ గౌడ్, ముక్కెర రమేష్ గౌడ్, అంపోజ్వాల శ్రీధర్ రెడ్డి, ఇమ్మడి నీరజ, కూచన ప్రమోద్, బండారి శంకర్, గుండు నారాయణ, ఆషాడపు దేవేందర్, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments