Saturday, September 21, 2024
Homeక్రైమ్కెనాల్​ లో పడి ఇద్దరు గల్లంతు.

కెనాల్​ లో పడి ఇద్దరు గల్లంతు.

ఎల్కతుర్తిలో విషాదం
కెనాల్లోపడి ఒకరి మృతి, మరొకరు గల్లంతు
గాలిస్తున్న రెస్క్యూ టీం..
స్పాట్ వాయిస్, ఎల్కతుర్తి: ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు వరుణ్, వంశీ ఎస్సారెస్పీ కెనాల్లో పడి గల్లంతయ్యారు.. దీంతో హన్మకొండ జిల్లా లో విషాదం నెలకొంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఎల్కతుర్తి కి చెందిన అంబాల రమేష్ కు ఇద్దరు కుమారులు.. పెద్ద కొడుకు వంశీ ఇంటర్ ఫస్టియర్చదివి మధ్యలో మానేసి ఇంట్లోనే ఉంటున్నాడు. కాజీ పేటకు చెందిన ఎల్తురి వరుణ్ వంశీకి మేనత్త కొడుకు.. వరుసకు ఇద్దరు బావ బామ్మర్ధులు. దేవుడి పండుగ కోసం నాలుగు రోజుల క్రితం వంశీ అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇద్దరు ఇంటి పక్కనే ఉన్న కెనాల్ వద్దకు బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కెనాల్ లో పడ్డారు. గమనించిన చిన్నాన్న వెంటనే కెనాల్ లో దూకి కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. కళ్ల ముందు అన్న కొడుకు, అక్క కొడుకు కెనాల్ లో కొట్టుకు పోతుంటే కాపాడలేకపోయాడు. కాగా, వంశీ తండ్రి గత సంవత్సరం కరోనా సోకి మృతి చెందాడని, ఇంతలోనే ఈ ఘటన జరగడం కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. గాలింపుల్లో ఓ మృత దేహం లభ్యం కాగా, మరొకరి కోసం రెస్క్యూ టీం కెనాల్ లో గాలింపు చర్యలు చేపట్టారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments