Saturday, September 21, 2024
Homeక్రీడలుఐపీఎల్: ఫస్ట్ మ్యాచ్ కోల్ కతాదే...

ఐపీఎల్: ఫస్ట్ మ్యాచ్ కోల్ కతాదే…

స్పాట్ వాయిస్, స్పోర్ట్స్: ఐపీఎల్ 15వ సీజన్​ మొదటి మ్యాచ్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ విజయం సాధించింది. చెన్నై జట్టు నిర్దేశించిన 132 పరుగులను 18.3 ఓవర్లలోనే ఛేదించింది. 132 స్వల్ప పరుగుల లక్ష్యఛేదనకు దిగిన కోల్​కతా జట్టు ఓపెనర్లు అజింక్య రహెనే, వెంకటేష్​ అయ్యర్​ శుభారంభం చేశారు. మెుదటి ఓవర్లోనే వెంకటేశ్ అయ్యర్​(16) బ్రావో బౌలింగ్​లో ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన నితిశ్​ రానా(21) నిలకడగా ఆడగా.. బ్రావో వేసిన పదో ఓవర్లో రాయుడుకు క్యాచ్​ ఇచ్చి పెవిలియన్​కు చేరాడు. అర్ధ సెంచరీ పూర్తి చేయడానికి దగ్గరవుతున్న ఓపెనర్​ రహెనే(44)ను మిచెల్ శాంట్నర్‌ ఔట్ ​ చేశాడు. అనంతరం బ్యాటింగ్ దిగిన బిల్లింగ్స్​(25) బ్రావో బంతికి అవుటయ్యాడు. కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​(20), జాక్సన్​(3) నాటౌట్​గా నిలిచారు. చెన్నై బౌలర్లలో బ్రావో మూడు వికెట్లు తీయగా.. శాంట్నర్‌ ఒక వికెట్​ పడగొట్టాడు.అంతకు ముందు, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టుకు ఆరంభంలోనే కోల్‌కతా షాక్‌ ఇచ్చింది. చివరి వరకు కట్టడి చేయడంతో 132 స్కోర్ చేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments