Thursday, April 17, 2025
Homeక్రైమ్ఎదురెదురుగా ఆటోలు ఢీ

ఎదురెదురుగా ఆటోలు ఢీ

ఎదురెదురుగా ఆటోలు ఢీ
ఐదుగురికి గాయాలు
స్పాట్ వాయిస్, గణపురం : ఎదురెదురుగా రెండు ఆటోలు ఢీకొనగా, వాటిలో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం… గణపురం మండల కేంద్రం శివారు కోట కాలువ సమీపంలో గణపురం నుంచి గాంధీనగర్ కు వెళ్తున్న ఆటో, గాంధీనగర్ నుంచి మండల కేంద్రానికి వస్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో అప్పయ్య పల్లి గ్రామానికి చెందిన అఖిల, తొట్ల అఖిల, పిల్లి పవన్, ఆటో డ్రైవర్ లు గోవిందు బూరం అజయ్, పెద్దాపూర్ గ్రామానికి చెందిన బొడ్డు సదయ్య గాయపడ్డారు. అయితే మద్యం మత్తులో గాంధీనగర్ వెళ్తున్న ఆటో అకస్మాత్తుగా గణపురం ప్రయాణికులతో వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో ములుగు సివిల్ ఆసుపత్రికి తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments