Friday, September 20, 2024
Homeక్రైమ్హైవే పై యాక్సిడెంట్​.. ఇద్దరి మృతి

హైవే పై యాక్సిడెంట్​.. ఇద్దరి మృతి

హై వేపై యాక్సిడెంట్​
బైక్‌ను ఢీ కొట్టిన లారీ..
అక్కడికక్కడే ఇద్దరు మృతి
స్పాట్ వాయిస్, జనగామ : సూర్యాపేట -జనగామ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి… సూర్యాపేట నుంచి జనగామ వైపునకు బుధవారం విజయవాడకు చెందిన వనపట్ల రోహిత్(22), విజయవాడలోని కానూరు మురళీ నగర్​కు చెందిన ఉప్పాడ వంశీ (18) బైక్​పై వెళ్తున్నారు. ఈ క్రమంలో జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చింతబావి తండా వద్ద లారీ వారిని ఢీ వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్​పై ప్రయాణిస్తున్న రోహిత్​, వంశీ అక్కడికక్కడే చనిపోయారు. కాగా, అదే సమయంలో చింతబావి తండాకు చెందిన ఆంగోతు సంజయ్ జనగామలోని సెయింట్ మేరీస్ పాఠశాలకు చదువుకునేందుకు బస్సు కోసం రోడ్డు పక్కన నిల్చున్నాడు. లారీ భైక్​ను ఢీకొట్టగా, వేగంగా గాలిలో ఎగిరిన బైక్​విద్యార్థి తలపైనుంచి పోవడంతో స్వల్పంగా గాయడ్డాడు. విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక ఎస్సై రాజు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను జనగామ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కాగా, ఇంటర్​చదువుతున్న వంశీపై మూడు రోజుల క్రితమే విజయవాడ పోలీస్​స్టేషన్​లో మిస్సింగ్​కేసు నమోదైంది. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments