Monday, April 21, 2025
Homeజిల్లా వార్తలురోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
అందుబాటులో లేని 108, వైద్య సిబ్బంది
ఆర్ ఎంపీలను ఆశ్రయిస్తున్న క్షతగాత్రులు
స్పాట్ వాయిస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల పరిధి జగన్నాథపురం వద్ద కుక్క అడ్డు రావడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న చీకుపల్లి గ్రామానికి చెందిన మీ సేవ నిర్వాహకుడు పొడెం సంతోష్ పొడెం తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని వాజేడు వైద్యశాలకు తరలించారు. అయితే అక్కడ వైద్యులు ఎవరూ అందుబాటులో లేరని, కనీసం 108 వాహనంలో తరలిస్తామనుకుంటే అది కూడా అందుబాటులో లేదని స్థానికులు వాపోయారు. దీంతో ఆర్ఎంపీని ఆశ్రయించి ప్రాథమిక చికిత్స చేయించామని, 108 కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వాహనంలో ఏటూరునాగారం వైద్యశాలకు తీసుకెళ్లామని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments