Sunday, June 8, 2025
Homeజిల్లా వార్తలుబాధిత కటుంబాలకు రేవూరి భరోసా

బాధిత కటుంబాలకు రేవూరి భరోసా

బాధిత కటుంబాలకు రేవూరి భరోసా
స్పాట్ వాయిస్, నల్లబెల్లి : మండల కేంద్రానికి చెందిన వేముల మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో చనిపోయాడు. అలాగే శనివారం ఆత్మహత్య చేసుకున్న వైనాల కుమార్ కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర నాయకుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఓదార్చారు. అలాగే మేడపల్లి గ్రామానికి చెందిన గోరంటి రంగనాయకమ్మ కుటుంబ సభ్యులను, మార్గం సదయ్య కుటుంబ సభ్యులను, విడియాల ప్రభాకర్ రావు తల్లి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమాల్లో నల్లబెల్లి బీజేపీ మండల అధ్యక్షుడు రేవూరి నరసింహారెడ్డి, మండల ఉపాధ్యక్షులు మామిండ్ల ఐలయ్య, వేముల రాజు, చుక్క రాజేష్, గాదం నాగరాజు, నాన్నబోయిన రాజకుమార్, బచ్చు వెంకన్న, సాయి కిరణ్, సాయి, చిన్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments